ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి* గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ప్రచారం..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేసేపల్లి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి వారిపై కేసులు పెట్టి వేధించారని సుమారు 3500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఏపీకి 12 లక్షల అప్పు భారం ప్రజలపై పెట్టిన ముఖ్యమంత్రి అది జగన్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరగలేదు రోడ్లు వేయలేదు నీళ్లు తీసుకురాలేదు పోలవరం కట్టలేదు మరి ఎందుకు అప్పులు పెరిగాయి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక గా జగన్ మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక మద్యం కరెంటు చెత్త పన్ను ఆస్తిపన్ను ప్రజలపై భారం వేసి కోట్లాది రూపాయలు వేశారని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే అన్నారు.
జగన్ రెడ్డి చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సొంతం చిన్నాన్న చంపిన వ్యక్తులను దగ్గర పెట్టుకొని రక్షిస్తున్నాడని అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Apr 16 2024, 06:33